సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-11T01:51:08+05:30 IST

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కు 600 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఓ వార్త సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది.

సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కు 600 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఓ వార్త సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీకి చెందిన స్టేట్ ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-11T01:51:08+05:30 IST