బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2022-02-12T04:56:43+05:30 IST
కర్ణాటక రాష్ట్రం మాండ్య పట్టణంలోని కాలేజీలో హిజాబ్ ధరించవద్దని ముస్లిం విద్యార్థినులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని కోటకొండలో పీవోడబ్ల్యూ, పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు.
నారాయణపేటరూరల్, ఫిబ్రవరి 11 : కర్ణాటక రాష్ట్రం మాండ్య పట్టణంలోని కాలేజీలో హిజాబ్ ధరించవద్దని ముస్లిం విద్యార్థినులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని కోటకొండలో పీవోడబ్ల్యూ, పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి యాదగిరి, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మీ, హాజీమలంగ్, సీపీఎం బాలప్పలు మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, స్వేచ్ఛను హరించడమే బీజేపీ ప్రభుత్వ సిద్ధాంతమని విమర్శించారు. తక్షణమే మైనార్టీ మహిళలపై జరుగుతున్న దాడులను ఆపివేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు బాలప్ప, నరసింహ, సలీం, ఇస్మాయిల్, కృష్ణ, రఫీ, అబ్దుల్, గోవిందు, సౌజన్య, అనిత, సరళ, ఫిర్మైనొద్దీన్, పీర్పాషా, మోలాన్సాబ్ తదితరులు పాల్గొన్నారు.