హిందువులపై అక్రమ అరెస్టులా..?
ABN , First Publish Date - 2020-09-12T17:54:39+05:30 IST
అంతర్వేది ఘటనలో అక్రమంగా అరెస్ట్ చేసిన హిందువులందరినీ విడుదల చేయాలని, వారిపై
సబ్ కలెక్టరేట్ వద్ద బీజేపీ, జనసేన నాయకుల నిరసన
విజయవాడ సిటీ: అంతర్వేది ఘటనలో అక్రమంగా అరెస్ట్ చేసిన హిందువులందరినీ విడుదల చేయాలని, వారిపై అక్రమ కేసులను ఎత్తివేయాలని బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని సబ్కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు, మాజీమంత్రి రావెల కిషోర్బాబు మాట్లాడుతూ అంతర్వేదిలోరథం అగ్నికి ఆహుతి కావడం హిందువుల మనోభావాలను గాయపరచడ మేనన్నారు. గతంలో దేవాలయాలపై జరిగిన దాడుల కేసులను కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు సబ్ కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. బీజేపీ నాయకులు వామరాజు సత్యమూర్తి, పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరాం, పాలూరి శ్రీనివాసరావు, ఉల్లూరి గంగాధర్, జనసేన నాయకుడు పోతిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మోపిదేవిలో ప్రదర్శన
మోపిదేవి: అంతర్వేదిలో అగ్నికి ఆహుతైన రథాన్ని పరిశీలించేందుకు వెళ్లగా, అక్రమంగా అరెస్ట్ చేసిన హిందువులను విడుదల చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు చిరువోలు బుచ్చిరాజు డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మోపిదేవిలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.