రాజేంద్రనగర్లోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
ABN , First Publish Date - 2021-08-30T18:44:12+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం రాజేందర్నగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
రంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం రాజేందర్నగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా బండి సంజయ్కు గుర్రాలు, ఒంటెలతో మైలార్ దేవ్పల్లి కార్పోరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఘన స్వాగతం పలికారు. బోనాలు, మంగళహారతులతో బండికి మహిళలు వీర తిలకం దిద్దారు. పాదయాత్రలో బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. బండి సంజయ్ యాత్రకు రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మరథం పట్టారు. మూడో రోజు యాత్రకు విశేష స్పందన లభించింది.