కాసేపట్లో మహంకాళీ దేవాలయానికి బండి సంజయ్

ABN , First Publish Date - 2020-11-30T13:27:38+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి దేవాలయానికి రానున్నారు.

కాసేపట్లో మహంకాళీ దేవాలయానికి బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి దేవాలయానికి రానున్నారు. జీహెఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గెలుపు కోసం బండి సంజయ్ ఉదయం 9 గంటలకు అమ్మవారిని సందర్శించి అమ్మ ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయానికి బండి సంజయ్ వెళ్లనున్నారు. రేపే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్మాత్మకంగా తీసుకున్న బీజేపీ... ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా తన ప్రచారాన్ని జోరుగా నిర్వహించింది. ఢిల్లీ నుంచి రోజు ఒకరు చెప్పున జాతీయ నేతలను రప్పించి రోడ్‌ షోలు, బహిరంగ సభలు చేపట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. 

Updated Date - 2020-11-30T13:27:38+05:30 IST