హుజురాబాద్లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు: Bandi sanjay
ABN , First Publish Date - 2021-11-02T17:48:02+05:30 IST
సీఎం కేసీఆర్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఫలితాలను సమీక్షిస్తున్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఫలితాలను సమీక్షిస్తున్నారు. ఎవరేమి కామెంట్స్ చేసినా.. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అని స్పష్టం చేశారు. హుజురాబాద్లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలిపారు. హుజురాబాద్లో బీజేపీ గెలుపు ఊహించినదే అని అన్నారు. హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని తెలిపారు. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్తో విరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ హ్యాట్సాఫ్ తెలిపారు.