మోదీ రక్షణపై కాంగ్రెస్ మహాకుట్ర పన్నింది: Bandi sanjay
ABN , First Publish Date - 2022-01-10T18:04:32+05:30 IST
ప్రధాన మంత్రి మోదీ రక్షణపై కాంగ్రెస్ పార్టీ మహా కుట్ర పన్నిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి మోదీ రక్షణపై కాంగ్రెస్ పార్టీ మహా కుట్ర పన్నిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పంజాబ్లో ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం బండి సంజయ్ మౌన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ రక్షణపై టీఆర్ఎస్ పార్టీ హేళనగా మట్లాడం బాధాకరమన్నారు. సీఎం కేసీఅర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు పూలలో పెట్టుకుని కేంద్రం రక్షణ కల్పిస్తోందని చెప్పారు. ఢిల్లీలో కేసీఆర్కు ఎలా ఉంటోందో ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. పంజాబ్ కాంగ్రెస్ రాసిచ్చిన స్ర్కిప్ట్ను టీఆర్ఎస్ చదువుతోందని మండిపడ్డారు. నీచమైన రాజకీయాలను టీఆర్ఎస్ నాయకులు ఆపాలన్నారు. ప్రధాని మోదీని అప్రతిష్టపాలు చేయాలనే దురాలోచన కాంగ్రెస్ చేసిందని విమర్శించారు. రహస్యంగా ఉంచాల్సిన ప్రధాని పర్యటన విరాలను బహిరంగ పరిచారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.