అందుకే కేసీఆర్ భయంతో ఢిల్లీకే పరిమితమయ్యారు: Bandi sanjay
ABN , First Publish Date - 2021-09-08T18:27:30+05:30 IST
పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించనంత స్పందన వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
సంగారెడ్డి: పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించనంత స్పందన వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం 11 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర తీరుతెన్నులపై సంగారెడ్డిలో పాదయాత్ర కమిటిలతో బండి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ 2023లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు వస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎంకు సమాచారం ఇచ్చాయన్నారు. అందుకే కేసీఆర్ భయంతో ఢిల్లీకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. పాదయాత్రపై కేంద్రం నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. యాత్రను ప్రోత్సహిస్తూ అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, జేపీ నడ్డా, అమిత్ షా స్పూర్తితో మరింత కష్టపడి పనిచేసి పాదయాత్రను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కోరుతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.