ఏపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది: బీజేపీ నేత
ABN , First Publish Date - 2020-05-23T13:50:10+05:30 IST
ఏపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది: బీజేపీ నేత
అమరావతి: ఏపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏబీఎన్ డిబేట్లో మాట్లాడుతూ ఏడాదిలోపే జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో 63 కేసుల్లో ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. రాజ్యాంగం, కోర్టులపై వైసీపీ నేతలకు గౌరవం లేదని విమర్శించారు. ఏపీలో జగన్ మాకొద్దు.. పోవాలి జగన్ అని ప్రజలు అంటున్నారని భానుప్రకాష్రెడ్డి వ్యాఖ్యానించారు.