వైసీపీ నేతలు పాదయాత్రలు చేస్తే కరోనా రాదా?: బైరెడ్డి శబరి

ABN , First Publish Date - 2020-11-22T19:39:15+05:30 IST

ఛలో తుంగభద్ర పుష్కర ఘాట్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన హిందూ సంఘాల నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి అన్నారు.

వైసీపీ నేతలు పాదయాత్రలు చేస్తే కరోనా రాదా?: బైరెడ్డి శబరి

కర్నూలు: ఛలో తుంగభద్ర పుష్కర ఘాట్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన హిందూ సంఘాల నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకురాలు బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం ఏబీఎన్‌తో శబరి మాట్లాడుతూ వైసీపీ నాయకులు పాదయాత్రలు చేస్తే కరోనా రాదా అని ప్రశ్నించారు. నదీస్నానాలు చేస్తే కరోనా వస్తుందని ప్రభుత్వం పుష్కర స్నానాలు నిషేధించడం దారుణమని మండిపడ్డారు.  నదీస్నానాల నిషేధం హిందూ మనోభావాలను కించపరిచే విధంగా ఉందన్నారు. మిగతా తొమ్మిది రోజులకైనా నదీస్నానాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని... లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని శబరి హెచ్చరించారు. 

Updated Date - 2020-11-22T19:39:15+05:30 IST