కరోనాతో బీజేపీ నేత మృతి
ABN , First Publish Date - 2021-05-16T06:12:33+05:30 IST
కరోనాతో బీజేపీ నేత మృతి
రేగొండ, మే 15: కరోనాతో బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి బాబూరావు (55) శనివారం మృతి చెందారు. మండలంలో ని గూడెపల్లి గ్రామానికి చెం దిన ఆయన నాలుగు రోజుల క్రి తం కరోనా బారిన పడ్డారు. దీంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అందుతున్న క్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.