మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదు

ABN , First Publish Date - 2021-08-23T23:35:28+05:30 IST

రాష్ర్టానికి మూడు రాజధానులు అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి

మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదు

అమరావతి: రాష్ర్టానికి మూడు రాజధానులు అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ అన్నారు. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి విశాఖపట్నంను రాజధానిగా చేస్తామని ఎన్నికలలో ప్రజలు ముందుకు వెళ్లారా? అని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశం కోర్టులో ఉన్నదన్నారు. న్యాయస్థానాన్ని ఒప్పించి విశాఖకు తీసుకెళ్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే వారు, కనీసం భూములు ఇచ్చిన రైతులను మనుషులుగా చూశారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సీబీఐ కేసులు ఉన్నవారు కోర్టు విచారణ సకాలంలో జరగకుండా వాయిదాల మీద వాయిదాలు సంవత్సరాలకు తరబడి తీసుకుంటున్నారని, రైతులు అవసరార్థం ఒక్క వాయిదా తీసుకుంటే పెడబొబ్బలు అవసరమా అని లంకా దినకర్‌ అన్నారు. 

Updated Date - 2021-08-23T23:35:28+05:30 IST