Etela Rajendar : జమునా హేచరీస్కు మళ్లీ నోటీసులు.. 16న విచారణ
ABN , First Publish Date - 2021-11-08T18:53:16+05:30 IST
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమున హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మెదక్: బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 16న విచారణ జరుగనుంది. మాసాయిపేట మండలం అచంపేట, హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూములు కబ్జా చేసినట్లు ఈటెల కుటుంబం ఆరోపణలు ఉన్నాయి. జమునా హర్చరీస్కు జూన్లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ.. కోవిడ్ దృష్ట్యా హైకోర్టు ఆదేశాలతో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో 16 న పూర్తిస్థాయిలో విచారణ జరుగనుంది.