విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి: Kanna

ABN , First Publish Date - 2021-09-18T17:53:24+05:30 IST

గుంటూరు: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి: Kanna

గుంటూరు: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని  బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలపై పెను భారం మోపుతోందని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో పేదల నడ్డి విరుస్తోందన్నారు. విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు దిగజారి ప్రవరిస్తున్నాయన్నారు. రాజుకీయ నాయకుడికి బాష, ప్రవర్తన  ముఖ్యమని మొదటి నుంచి చెపుతున్నామని తెలిపారు. నిన్న టీడీపీ, వైసీపీ నేతలు దుర్భాషలు ఆడుకోవడం రాష్ట్ర ప్రజలు అందరు గమనిస్తున్నారన్నారు. ఒక్కో ప్రజా ప్రతినిధి రెండు లక్షల మందికి ఆదర్శమని గుర్తించాలని హితవుపలికారు. రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలు మెచ్చే పాలన అందిస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-18T17:53:24+05:30 IST