మాణిక్యాలరావు లాంటి నిబద్ధత గల వ్యక్తిని బీజేపీ కోల్పోయింది: కన్నా

ABN , First Publish Date - 2020-08-02T17:43:13+05:30 IST

మాణిక్యాలరావు లాంటి నిబద్ధత గల వ్యక్తిని బీజేపీ కోల్పోయింది: కన్నా

మాణిక్యాలరావు లాంటి నిబద్ధత గల వ్యక్తిని బీజేపీ కోల్పోయింది: కన్నా

గుంటూరు: మాణిక్యాలరావు లాంటి నిబద్ధత గల వ్యక్తిని ఏపీ బీజేపీ కోల్పోయిందని కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు తొమ్మిదవ యేటనే సంఘ్ కార్యక్రమాలలో పాల్గోనేవాడని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ అభివృద్ధికి కృషి చేశారని... తాడేపల్లిగూడెం బీజేపీ అభ్యర్థిగా గెలుపొంది మంత్రిగా పని చేశారన్నారు. పార్టీ ఏ పని అప్పగించిన చిత్త శుద్ధితో నిర్వహించే వారని కొనియాడారు. మాణిక్యాలరావు కుటుంబానికి కన్నా లక్ష్మీనారాయణ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2020-08-02T17:43:13+05:30 IST