దేవాలయాలను ఆదాయ వనరులుగా పరిగణించడం దుర్మార్గం: లంకా దినకర్

ABN , First Publish Date - 2021-09-04T17:23:34+05:30 IST

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన టీటీడీ నుండి సంవత్సరానికి రూ.50 కోట్లు రాబట్టడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా ఇస్తుందని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు.

దేవాలయాలను ఆదాయ వనరులుగా పరిగణించడం దుర్మార్గం: లంకా దినకర్

అమరావతి: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన టీటీడీ నుండి సంవత్సరానికి రూ.50 కోట్లు రాబట్టడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా ఇస్తుందని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. శ్రీశైలం నుండి రూ.30 కోట్లు తీసుకోవడమే దుర్మార్గం అయితే టీటీడీ నుండి ఇప్పుడు రూ.50 కోట్లు తీసుకోవడం ఆ దుర్మార్గన్ని విస్తరించడమే అని మండిపడ్డారు. ఇతర ప్రార్ధనా మందిరాలకు, మత బోధకులకు జీతాలు ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా ఇస్తూన్నారని.... మరో ప్రార్ధన మందిరం నుండి వసూళ్లు చేయడం లేదు కదా అని నిలదీశారు. దేవాలయాల నిధులు మాత్రం మరో దేవాలయం నుండి సర్దుబాటు ధర్మమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలకు నిధులు ప్రభుత్వం నేరుగా సర్దుబాటు చేయాలి కాని టీటీడీ నుండి కాదన్నారు. దేవాలయాలు ఆదాయ వనరులుగా మాత్రమే ప్రభుత్వం పరిగణించడం దుర్మార్గమని లంకా దినకర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-04T17:23:34+05:30 IST