ప్రభుత్వ పనితీరుతో నేతన్నకు తప్పని కలవరం: Lanka dinakar
ABN , First Publish Date - 2021-09-15T17:09:34+05:30 IST
కేంద్రం వరం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో నేతన్నకు కలవరం తప్పడం లేదని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.
అమరావతి: కేంద్రం వరం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో నేతన్నకు కలవరం తప్పడం లేదని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మగ్గంకి పగ్గం అంటూ 90శాతం సబ్సిడీ, ఒక్కో క్లస్టర్కి రూ.2 కోట్లు ఇస్తుంటే, దానిపై దృష్టి సారించకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పాత యంత్రాలతో ఉత్పాదకత లేకపోవటంతో వ్యయం పెరిగి నేతన్న నష్టాల్లో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నను ఆదుకునేందుకు ఆధునిక యంత్రాలను ఇంత పెద్ద మొత్తం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలో పని చేయడం లేదని లంకా దినకర్ అన్నారు.