కరెంటు వాడకపోతే బాదే బాదుడు నభూతో నభవిష్యత్: Lanka dinakar

ABN , First Publish Date - 2021-10-19T17:55:30+05:30 IST

రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడుపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కరెంటు వాడకపోతే బాదే బాదుడు నభూతో నభవిష్యత్: Lanka dinakar

అమరావతి: రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడుపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు వాడినా, వాడకున్నా ప్రభుత్వం చార్జీల బాదుడే బాదుడు అని అన్నారు. ముందు ట్రూఅప్ చార్జీలు అంటే ఏమో అనుకున్నామని.. కానీ ట్రూత్ ఏమంటే కరెంటు వాడకపోతే బాదే బాదుడు నభూతో నభవిష్యత్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక గృహవిద్యుత్ వినియోగదారుడు  గత నెల 71 యూనిట్లు వాడితే బిల్లు రూ. 243 వస్తే, ఈ నెల వినియోగం " 0" యూనిట్లకు రూ.303 బిల్లు వచ్చిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జుట్టు ఉన్న లేదా గుండు కొట్టించుకున్నా పన్నె పన్ను అన్న తుగ్లక్ పాలన గుర్తుకు వస్తోందని లంకా దినకర్ దుయ్యబట్టారు. 

Updated Date - 2021-10-19T17:55:30+05:30 IST