రూ.26000 కోట్ల నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి: లంకాదినకర్

ABN , First Publish Date - 2021-09-29T16:03:48+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను నడపాల్సింది బ్యాంకులా లేక రాష్ట్ర ప్రభుత్వమా అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు.

రూ.26000 కోట్ల నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి: లంకాదినకర్

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను నడపాల్సింది బ్యాంకులా లేక రాష్ట్ర ప్రభుత్వమా అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. కేంద్ర పథకాలకు కేంద్ర నిధుల తాకట్టుతో మ్యాచింగ్ గ్రాంట్ నిధుల కోసం బ్యాంకులను అప్పు అడగడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు జగన్ తన స్టిక్కర్ వేయడమే కాదు, చాలా నిధులు కూడా డైవర్షన్ చేశారని ఆరోపించారు. ప్రతి కేంద్ర పథకానికి ప్రత్యేక ఖాతా తెరవాల్సినా, కేవలం 5 ఖాతాలతో అన్ని పథకాలను మేనేజ్ చేయడం సూట్ కేస్ కంపెనీల నిర్వాహణ లాంటిదే కదా అని మండిపడ్డారు. పేదలకు గృహాలు, రహదారుల మరమత్తులు, కార్మికుల ఈఎస్ఐ నిధులు, భవన నిర్మాణ కార్మికుల నిధులు లాంటి కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.26000 కోట్లు గత రెండు సంవత్సరాలుగా ఎటు తరలించారో శ్వేతపత్రం విడుదల చేయాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-29T16:03:48+05:30 IST