కమిట్మెంట్ లేని కలర్ పత్రికా ప్రకటనలు అవసరమా?: లంకా దినకర్

ABN , First Publish Date - 2021-10-11T18:22:48+05:30 IST

ప్రజలను నమ్మించడానికి తిరుపతిలో గోమందిర ప్రారంభోత్సవానికి వెలుతున్నట్టు జగన్మోహన రెడ్డి కలరింగ్ ఇస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు.

కమిట్మెంట్ లేని కలర్ పత్రికా ప్రకటనలు అవసరమా?: లంకా దినకర్

అమరావతి: ప్రజలను నమ్మించడానికి తిరుపతిలో గోమందిర ప్రారంభోత్సవానికి వెలుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి కలరింగ్ ఇస్తున్నారని  బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు.  కమిట్మెంట్ లేని కలర్ పత్రిక ప్రకటనలు అవసరమా? అని  ప్రశ్నించారు. నిత్యం అసభ్య పదజాలంతో విమర్శించే పత్రికలకు కూడా ప్రకటనలు ఇచ్చి మరీ దేవాలయల వద్ద జరుగుతున్న అన్యమత ప్రచారాలను పక్కదోవ పట్టించేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి ప్రచార జిమ్మిక్కులతో కాకుండా, టీటీడీ నియమాల ప్రకారం సతీ సమేతంగా హిందు ఆచార సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు తిరుమలేశుని సేవిస్తారని నిలదీశారు. ఒక వైపు అన్యమత ప్రచారానికి రాష్ట్రంలో ఊతం ఇస్తూ, మరోవంక నామలతో పత్రిక ప్రకటన ఫొటోలో హిందత్వానికి  జగన్మోహన రెడ్డి పంగనామాలు పెడుతున్నారని లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-10-11T18:22:48+05:30 IST