కరోనా మహమ్మారి తరలిపోవాలి: లక్ష్మణ్

ABN , First Publish Date - 2021-01-14T18:58:38+05:30 IST

సంక్రాంతి ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ అని బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు.

కరోనా మహమ్మారి తరలిపోవాలి: లక్ష్మణ్

హైదరాబాద్: సంక్రాంతి ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ అని బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన పతంగుల పండుగ కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఇక్కడ కైట్ ఫెస్టివల్ నిర్వహణ జరుగుతుందన్నారు. గొబ్బెమ్మలు, పూలు, ముగ్గులు పెట్టడం వల్ల క్రిమికీటకాలు రాకుండా ఉండేవి అని.. సంక్రాంతికి పిండి వంటలు ఆహారపు అలవాట్లు మళ్ళీ గుర్తు చేస్తుందని తెలిపారు. పట్టణాల్లో ఫాస్ట్ ఫుడ్‌లు, పిజ్జా, బర్గర్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి కోవిడ్ కేసులు ఇక్కడే వస్తున్నాయన్నారు. ఆహారపు అలవాట్లు మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, శాస్త్రవేత్తల కృషి వల్లే రేపటి నుండి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మంచి సందేశం ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-14T18:58:38+05:30 IST