కేసీఆర్ పీఠం కదులుతుందనే భయంతో దాడులు: Padmareddy

ABN , First Publish Date - 2021-11-16T16:46:21+05:30 IST

నల్లగొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్2పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి అన్నారు.

కేసీఆర్ పీఠం కదులుతుందనే భయంతో దాడులు: Padmareddy

హనుమకొండ: నల్లగొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్ల దాడిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ పీఠం కదులుతుందనే భయంతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ప్రతీకార దాడులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో తమ అక్రమాలకు అండగా నిలిచి కాళ్ళు మొక్కిన కలెక్టర్‌కు ఎమ్మల్సీ పదవి ఇవ్వాలనుకోవడం సిగ్గుచేటని పద్మారెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-16T16:46:21+05:30 IST