కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన పాతూరి నాగభూషణం

ABN , First Publish Date - 2021-06-11T16:48:59+05:30 IST

జిల్లాలోని తుళ్లూరు మండలంలో గల కరకట్ట ప్రాంతాన్ని బీజేపీ నేత పాతూరి నాగభూషణం శుక్రవారం పరిశీలించారు.

కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన పాతూరి నాగభూషణం

గుంటూరు: జిల్లాలోని తుళ్లూరు మండలంలో గల కరకట్ట ప్రాంతాన్ని బీజేపీ నేత పాతూరి నాగభూషణం శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. డ్రెడ్జింగ్‌కు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కరకట్టను తవ్వేస్తుంటే జల వనరులుశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీర్రాజు ఆదేశాల మేరకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులకు వార్షిక కౌలు, కూలీలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.మూడు రాజధానుల సంగతి తమకు చెప్పిచేయలేదని...అది తమ పార్టీ అంశం కాదని పాతూరి నాగభూషణం అన్నారు. 

Updated Date - 2021-06-11T16:48:59+05:30 IST