ప్రజలు కల్వకుంట్ల కుటుంబంపై తిరగపడ్డారు: రాకేష్ రెడ్డి
ABN , First Publish Date - 2020-12-04T16:50:23+05:30 IST
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో మెజారిటీ స్థానాల్లో భారతీయ జనతాపార్టీ ఆధిక్యంలో ఉంది.
హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో మెజారిటీ స్థానాల్లో భారతీయ జనతాపార్టీ ఆధిక్యంలో ఉంది. దీనిపై స్పందించిన బీజేపీ నేత రాకుష్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రజలు కల్వకుంట్ల కుటుంబంపై తిరగపడ్డారని, జనతా గ్యారేజీవైపు నిలుచున్నారని.. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కోగలిగే శక్తి ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందన్నారు. పోలీసులు, ఈసీని అడ్డం పెట్టుకుని, బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయించి... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవాలని ప్రయత్నించిందని విమర్శించారు. అయినా ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారని అన్నారు. ఆఖరి సమయంలో 12 నుంచి 18 శాతం ఓటింగ్ పెరిగిందని, అధికారపార్టీ రిగ్గింగ్ చేయించిందని రాకేష్ రెడ్డి ఆరోపించారు.