మోదీ, యోగిపై కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: విష్ణుకుమార్ రాజు
ABN , First Publish Date - 2020-09-24T17:27:28+05:30 IST
మంత్రి కొడాలి నాని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం దారుణమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.
విశాఖపట్నం: మంత్రి కొడాలి నాని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం దారుణమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వారికి... కొడాలి నానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. జగన్ మెప్పు కోసమే కొడాలి నాని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, యోగి ఆదిత్యపై జగన్కు ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే మంత్రి వర్గం నుంచి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొడాలి నాని మత్తులో ఉన్నారని..ఆ మత్తుని తమరే వదిలించాలి అంటూ జగన్ను కోరారు. మరోవైపు ఈ ఉదయం విష్ణుకుమార్ రాజును తెలుగు శక్తి అధ్యక్షుడు బి రామ్ కలిశారు. హిందూ సమాజాన్ని కించపరిచే నాయకులకు బుద్ధి చెప్పాలని విష్ణుకుమార్ రాజును కోరుతూ... వినతి పత్రం సమర్పించారు.