ధర్నాలు ఇక్కడ కాదు.. ఢిల్లీలో చేయండి

ABN , First Publish Date - 2021-05-12T17:37:24+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వాక్సిన్‌ సరఫరా చేయక పోవడం వల్లనే నేడు కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని టీఆర్‌ఎస్‌ మాజీ....

ధర్నాలు ఇక్కడ కాదు.. ఢిల్లీలో చేయండి

బీజేపీ నాయకులకు టీఆర్‌ఎస్‌ నాయకుల హితవు

హైదరాబాద్/చంపాపేట: కేంద్ర ప్రభుత్వం వాక్సిన్‌ సరఫరా చేయక పోవడం వల్లనే నేడు కరోనా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని టీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు అన్నారు. వెంకటేశ్వర కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్డిఅన్నారం, హయత్‌నగర్‌, హస్తినాపురం డివిజన్‌ మాజీ కార్పొరేటర్లు భవానీ ప్రవీణ్‌కుమార్‌, సామ తిరుమల్‌రెడ్డి, రామావత్‌ పద్మానాయక్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తుంటే రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాయకులు, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులు ధర్నాలు చేయవలిసింది ఇక్కడ కాదని, ఢిల్లీలోని పార్లమెంటు, బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని వారు హతవు పలికారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్ని ప్రాంతాలను తిరుగుతూ ప్రజలకు కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోజు సత్యంచారి, శ్రీనివా్‌సనాయక్‌, భీమ్‌లాల్‌నాయక్‌, వెంకట్‌రావు, రవిచారి, మల్లేష్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-12T17:37:24+05:30 IST