యోగి, మోదీల గురించి మాట్లాడే అర్హత నానికి లేదు: బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2020-09-24T18:25:53+05:30 IST

తిరుపతి : కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని.. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది

యోగి, మోదీల గురించి మాట్లాడే అర్హత నానికి లేదు: బీజేపీ నేతలు

తిరుపతి : కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని.. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. యోగి, మోదీల గురించి మాట్లాడే అర్హత తాగుబోతు నానికి లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. నాని మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి వెనుక నుంచి అలా మాట్లాడిస్తున్నారా? అని ప్రశ్నించారు. నానిని తక్షణమే మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మరో మంత్రి  ఇలా మాట్లాడకూడదంటే నానిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు.

Updated Date - 2020-09-24T18:25:53+05:30 IST