12 జిల్లాలకు బీజేపీ సారథులు

ABN , First Publish Date - 2020-09-23T08:15:26+05:30 IST

బీజేపీ రాష్ట్రంలోని 12 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.

12 జిల్లాలకు బీజేపీ సారథులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ రాష్ట్రంలోని 12 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పార్టీ కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు జిల్లాలకు కూడా అధ్యక్షులు ఉన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నియామక ఉత్తర్వులు జారీ చేశారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌ రెడ్డి తెలిపారు. కాగా, టీడీపీ, టీఆర్‌ఎ్‌సల నుంచి వచ్చిన ఇద్దరు సీనియర్‌ నాయకులకు కూడా జిల్లా పదవులు దక్కాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సామ రంగారెడ్డి రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో కొద్దినెలల కిందట చేరిన పన్నాల హరీశ్‌రెడ్డి మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.


జిల్లా అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి...

మేడ్చల్‌ రూరల్‌- పి. విక్రంరెడ్డి,  కామారెడ్డి - అరుణ తార (మాజీ ఎమ్మెల్యే), రంగారెడ్డి అర్బన్‌ - సామ రంగారెడ్డి , జగిత్యాల - పైడిపల్లి (మోరెపల్లి) సత్యనారాయణరావు, మేడ్చల్‌ అర్బన్‌ - పన్నాల హరీశ్‌రెడ్డి, గోల్కొండ-గోషామహల్‌ - వి. పాండుయాదవ్‌, భాగ్యనగర్‌-మలక్‌పేట - సంరెడ్డి సురేందర్‌రెడ్డి, ఖమ్మం - గల్లా సత్యనారాయణ, సూర్యాపేట - బొబ్బా భాగ్యరెడ్డి, మహంకాళి-సికింద్రాబాద్‌ - బి.శ్యాంసుందర్‌గౌడ్‌, వికారాబాద్‌ - సదానంద్‌రెడ్డి, బర్కత్‌పుర-అంబర్‌పేట - డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు.

Updated Date - 2020-09-23T08:15:26+05:30 IST