Telangana: గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం భేటీ
ABN , First Publish Date - 2021-11-16T17:09:44+05:30 IST
రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయ్యింది.
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై దాడి, పోలీసులు వ్యవహారశైలిపై గవర్నర్కు నేతలు ఫిర్యాదు చేశారు. వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి బీజేపీ బృందం తీసుకెళ్లింది. ఈ సమావేశానికి ఈటల, రఘనందనరావు, రాజసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి, విజయరామారావు, పొంగులేటి హాజరయ్యారు.