మార్కెట్‌లో ఉరేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే..

ABN , First Publish Date - 2020-07-13T16:09:53+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో ఘోరం జరిగింది. బీజేపీకి చెందిన దేవేంద్ర నాథ్ రాయ్ అనే ఎమ్మెల్యే దినాజ్‌పూర్‌లోని

మార్కెట్‌లో ఉరేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే..

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఘోరం జరిగింది. బీజేపీకి చెందిన దేవేంద్ర నాథ్ రాయ్ అనే ఎమ్మెల్యే దినాజ్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఉరేసుకొని చనిపోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. అయితే బీజేపీ మాత్రం దీనిని హత్యే అని ఆరోపిస్తోంది. అయితే ఈయన ఎందుకు ఉరేసుకున్నారన్నది మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై బెంగాల్ బీజేపీ ట్వీట్ చేస్తూ...


‘‘ఉత్తర దినాజ్‌పూర్‌లోని రిజర్వ్‌డ్ సీట్ అయిన హేమతాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఇంటికి సమీపంలో ఉరేసుకున్నట్లు గుర్తించారు. ఆయన్ను ఎవరో చంపారు. ఆ తర్వాతే ఉరి తీశారు. ఆయన 2019 లో బీజేపీలో చేరారు. ఇదే ఆయన చేసిన తప్పేమో?’’ అని బీజేపీ ట్వీట్ చేసింది. ఓ షాపు దగ్గర ఎమ్మెల్యే ఉరేసుకున్నట్లు తాము గుర్తించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు ప్రకటించారు. 

స్పందించిన గవర్నర్ ధన్కర్

‘‘ఈ ఉదంతం అనేక ఆరోపణలకు తావిస్తోంది. హత్య చేశారన్న ఆరోపణలూ వస్తున్నాయి. సత్యాన్ని ఆవిష్కరించడానికి, రాజకీయ హింసను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నిష్పక్షపాతమైన దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది.’’ అని ధన్కర్ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-07-13T16:09:53+05:30 IST