కేసీఆర్‌కు ధన్యవాదాలు: ఎమ్మెల్యే Raghunandan

ABN , First Publish Date - 2021-12-30T18:34:34+05:30 IST

నిన్నటి నల్లగొండ పర్యటనలో నిజాలు ఒప్పుకున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

కేసీఆర్‌కు ధన్యవాదాలు: ఎమ్మెల్యే Raghunandan

సూర్యాపేట: నిన్నటి నల్లగొండ పర్యటనలో నిజాలు ఒప్పుకున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు అని  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. జిల్లాలో జరుగుతున్న పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... కేవలం సిద్దిపేట, గజ్వేల్‌లో మాత్రమే అభివృద్ధి పధంలో ఉన్నాయని కేసీఆర్ ఒప్పుకున్నారన్నారు. ఏడేళ్ళ పాలనలో రాష్ట్ర నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్‌కే వెళ్తున్నా మంత్రులు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. గత జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్ ఆ మాటే మరిచారని విమర్శించారు. అధికారం, కమీషన్ల కోసమే పని చేస్తున్నట్లు ఉందన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ఉత్తర్వులు ఇప్పించింది తామే అని... ఢిల్లీకి వెళ్లిన మంత్రులు చేసింది శూన్యమని వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి రావడానికి సిట్టింగ్లు ఆసక్తి చూపిస్తుంది వాస్తవమే అని, జనవరి తరవాత శుభవార్త ఉంటుందని ఎమ్మెల్యే రఘునందన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-30T18:34:34+05:30 IST