పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రఘునందనరావు... బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్లు
ABN , First Publish Date - 2022-01-04T18:26:16+05:30 IST
సికింద్రాబాద్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ శాంతి ర్యాలీ తలపెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్లు చేస్తున్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ శాంతి ర్యాలీ తలపెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్లు చేస్తున్నారు. నియోజకవర్గానికి వెళ్తోన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావును తూప్రాన్ టోల్గేట్ దగ్గర మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు ముఖ్యనేతలు ఉన్నారు. శాంతి ర్యాలీలో జాతీయ నేత జేపీ నడ్డా పాల్గొంటారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అయితే కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో శాంతి ర్యాలీకి అనుమతిని పోలీసులు నిరాకరించారు. అయితే శాంతి ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టంచేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్ట్లు చేస్తున్నారు.