బోనాల వేడుకల సమీక్షలో ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి
ABN , First Publish Date - 2021-06-25T18:57:47+05:30 IST
బోనాల వేడుకల సమీక్షలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: బోనాల వేడుకల సమీక్షలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం బోనాలు ఏర్పాటుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న గ్రేటర్లో చాలా వరకు వ్యాక్సిన్ ఇవ్వలేదన్నారు. బోనాల వేడుకల నేపథ్యంలో ఆలయాల వద్ద రద్దీ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత మేరకు వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలన్నారు. బోనాల వేడుకలు ఉన్నాయని తెలిసిన ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు బోనాలకు మరో పదిహేను రోజులు ఉన్నందున వీలైనంత త్వరగా అందివ్వాలన్నారు. ఈ వేడుకలకు యువత ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే వారికి టీకా ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.