బడ్జెట్ పుస్తకాలకే పరిమితం..: రాజాసింగ్
ABN , First Publish Date - 2021-03-18T19:56:18+05:30 IST
2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశ పెట్టారు.
హైదరాబాద్: 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశ పెట్టారు. బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. గురువారం బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. బడ్జెట్ పుస్తకాలకే పరిమితం.. అమలు చేయరని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మూసీ నదికి కేటాయించిన కోట్లు ఎటుపోయాయి? అని ప్రశ్నించారు. క్రీడా రంగానికి ఒక్క రూపాయి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్గా తయారైందని రాజాసింగ్ అన్నారు.