భూముల కొనుగోలులో అవినీతిపై సోమువీర్రాజు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-06-05T18:59:52+05:30 IST

భూముల కొనుగోలులో అవినీతిపై సోమువీర్రాజు ఆగ్రహం

భూముల కొనుగోలులో అవినీతిపై సోమువీర్రాజు ఆగ్రహం

రాజమండ్రి: పేదలకు ఇళ్ల స్థలాల కోసం ముంపునకు గురయ్యే ఆవ భూముల్ని కొనుగోలు చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలులో అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ సోమువీర్రాజు శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుకొండ ఆవ భూముల అవినీతిపై  లేఖ రాసినా సీఎం జగన్  నిమ్మకు నీరెత్తినట్లుగా  ఉన్నారని మండిపడ్డారు. రాజానగరం నియోజకవర్గంలో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూములు కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపించారు. భూములు కొనుగోలులో అవినీతిపై బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు పార్టీలు ఉద్యమం చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు భూములు కొనుగోలును నిరసిస్తూ సంబంధిత గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో  ఆవ భూముల కొనుగోలును ప్రభుత్వం విరమించుకునే వరకు బీజేపీ ఉద్యమం కొనసాగుతుందని సోమువీర్రాజు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-05T18:59:52+05:30 IST