దివాళాస్థితిలో ఏపీ: ఎంపీ టీజీ

ABN , First Publish Date - 2021-12-04T23:53:11+05:30 IST

ఏపీ ప్రభుత్వం దివాళాస్థితిలో ఉందని బీజేపీ ఎంపీ

దివాళాస్థితిలో ఏపీ: ఎంపీ టీజీ

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం దివాళాస్థితిలో ఉందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుందన్నారు. ఏపీకి దశ, దిశ  బీజేపీనేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నిధుల్ని వైసీపీ ప్రభుత్వం సరిగా వాడుకోవడం లేదన్నారు. కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు బాధ్యతారాహిత్యమన్నారు.  కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు దురుద్దేశాలు ఆపాదిస్తే కేంద్రంలో ఏపీకి ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. 



Updated Date - 2021-12-04T23:53:11+05:30 IST