లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ బిచ్చమెత్తిన శివాజీ వంశస్థుడు

ABN , First Publish Date - 2021-04-11T13:50:53+05:30 IST

మహారాష్ట్రలో కరోనా కల్లోలం నేపధ్యంలో మరోమారు...

లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ బిచ్చమెత్తిన శివాజీ వంశస్థుడు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం నేపధ్యంలో మరోమారు లాక్‌డౌన్ విధించవద్దంటూ పలువురు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఛత్రపతి శివాజీ వంశస్థులు, బీజేపీ ఎంపీ ఉదయన్ భోస్లే లాక్‌డౌన్ విధించవద్దని కోరుతూ చేతిలో పళ్లెం పట్టుకుని, రోడ్డు మీద కూర్చుని బిచ్చమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీకెండ్ లాక్‌డౌన్ కారణంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, పేదలు తిండికి కూడా అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కాగా భోస్లే తాను బిచ్చమెత్తగా వచ్చిన 450 రూపాయలను జిల్లా అధికారులకు అందజేస్తూ, లాక్‌డౌన్‌పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 



Updated Date - 2021-04-11T13:50:53+05:30 IST