మహనీయుడు దీన్దయాళ్ ఉపాధ్యాయ
ABN , First Publish Date - 2022-02-12T05:28:36+05:30 IST
పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ భార తీయ జనతాపార్టీకి పునాదులు వేసిన మహనీయుడని, మూలసిద్ధాంతాలు అందించిన నేత అని జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ కొనియాడారు.
- నివాళి అర్పించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
గద్వాల/ అయిజ/ అలంపూర్/ వడ్డేపల్లి, ఫిబ్రవరి 11 : పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ భార తీయ జనతాపార్టీకి పునాదులు వేసిన మహనీయుడని, మూలసిద్ధాంతాలు అందించిన నేత అని జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ కొనియాడారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని పురస్కరిం చుకొని గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఉన్న అట్టడుగు పేద వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ రామాంజనేయులు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీని వాస్ గౌడ్, మునిసిపల్ మాజీ చైర్పర్సన్ కృష్ణవేణి, నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆశయాలను కొనసాగిద్దాం
మహనీయుల ఆశయాలను కొనసాగిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అయిజలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పండిత్ దీన్దయాళ్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి పునాదులు వేసిన మహనీయుడు దీన్దయాళ్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు మెడికల్ తిర్మల్రెడ్డి, మాద న్న, కాలేజీ నర్సింహయ్యశెట్టి, రామకృష్ణ, లక్ష్మణ్గౌడు, గోపాలకృష్ణ, షరీఫ్ పాల్గొన్నారు.
- పండిట్ దీన్దయాల్ వర్ధంతిని పురస్కరించు కొని అలంపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగమద్దిలేటి మాట్లాడుతూ దీన్ దయాళ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి, జిల్లా ఉపాఽధ్యక్షుడు ఈశ్వరయ్య, రవి కుమార్, మండల ప్రధాన కార్యదర్శి రంగస్వామి, యువమెర్చా అధ్యక్షుడు సుధాకర్యాదవ్, పట్టణ యువమోర్చా కార్యదర్శి జగదీష్ పాల్గొన్నారు.
- వడ్డేపల్లి మండలం జూలకల్లు గ్రామంలో యువమోర్చా మండల అధ్యక్షుడు జి.వెంకటరాము డు ఆధ్వర్యంలో దీన్దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు సుంకన్న, పరశురాముడు పాల్గొన్నారు.