టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే
ABN , First Publish Date - 2020-12-05T04:07:16+05:30 IST
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ను గద్దెదించేందుకు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు తమటం సాయికృష్ణగౌడ్ పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు
కొల్లాపూర్లో సంబురాలు
కొల్లాపూర్, డిసెంబరు 4 : రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ను గద్దెదించేందుకు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు తమటం సాయికృష్ణగౌడ్ పేర్కొన్నారు. హైద్రాబాద్ జీహెచ్ ఎమ్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల శుక్రవారం సా యంత్రం కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణసం చా కాల్చి బీజేపీ సంబరాలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు పిలుపు మేరకు సంబురాలు నిర్వహించినట్లు సాయికృష్ణగౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించినా ఓటర్లకు ఆయన కృతజ్ఞతనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాషాయజెండా రెపరెపలాడుతుందని, కొల్లాపూర్ కోటపై కూడా కమలం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సందు రమేష్, నగర అధ్యక్షుడు కాకి సత్యనారాయణగౌడ్, బీజేపీ పాన్గల్ మండలాధ్యక్షుడు అన్వేష్, కాశిపురం మహేష్, నాయకులు రమేష్రాథోడ్, సురేందర్, పిన్నంశెట్టి శివ, ఇరిగదిండ్ల పరమేష్, కంటే శివకృష్ణ, మల్లేష్, ఎస్.పురంధర్ తదితరులు పాల్గొన్నారు.