బీజేపీ అభ్యర్థులుగా సోనోవాల్, మురుగన్

ABN , First Publish Date - 2021-09-18T20:31:08+05:30 IST

రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థులుగా కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, ఎల్.మురుగన్‌లను..

బీజేపీ అభ్యర్థులుగా సోనోవాల్, మురుగన్

న్యూఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, ఎల్.మురుగన్‌లను బీజేపీ శనివారంనాడు నామినేట్ చేసింది. గత జూలై 7న మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ ఇద్దర్నీ మోదీ  తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ పశ్చిమబెంగాల్, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఒక్కో సీటుకు, తమిళనాడులో 2 సీట్లకు ఉప ఎన్నికలు ప్రకటించింది. అక్టోబర్ 4న ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మానస్ రంజన్ భునియా (పశ్చిమబెంగాల్), బిశ్వజిత్ డయామెరీ (అసోం), కెపి మునుస్వామి, ఆర్.వైద్యలింగం (తమిళనాడు), థావర్ చంద్ గెహ్లాట్ (మధ్యప్రదేశ్) రాజీనామా చేయడంతో ఈ సీట్లకు ఖాళీ ఏర్పడింది. మహారాష్ట్రలో రాజీవ్ సతవ్ గత మే 16న కోవిడ్ అనంతరం ఆరోగ్య సమస్యలతో కన్నుమూయడంతో ఆ సీటుకు ఖాళీ ఏర్పడింది.

Updated Date - 2021-09-18T20:31:08+05:30 IST