సాక్షి కథనం మసిపూసి మారేడుకాయ చందంగా ఉంది: రామ్ మాధవ్

ABN , First Publish Date - 2020-05-30T18:03:30+05:30 IST

సాక్షి మీడియాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సాక్షి కథనం మసిపూసి మారేడుకాయ చందంగా ఉంది: రామ్ మాధవ్

ఇంటర్నెట్ డెస్క్: సాక్షి మీడియాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏడాది పాలనా కాలం పూర్తైన సందర్భంగా తానిచ్చిన ఇంటర్వ్యూను సాక్షి మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. అసలు తానేం మాట్లాడాను... తన మాటలను ఎలా వక్రీకరించారన్న విషయాన్ని వివరిస్తూ ఏపీ బీజేపీ నేతలకు స్వయంగా లేఖ రాశారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనం కొంతవరకు మసిపూసి మారేడుకాయ చేసే చందంగా ఉన్నందువల్ల ఈ కొద్దిపాటి వివరణ ఇస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. 40 నిమిషాల వీడియో ఇంటర్వ్యూను పూర్తిగా చూపిస్తే ఈ విషయాలననీ స్పష్టమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రతిపక్ష పార్టీ అని, రాజకీయంగా ఎదగాలని, అందుకోసం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తామని చెప్పానని, అంతమాత్రాన రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకమని భావించరాదన్న విషయాన్ని గుర్తించాలన్నానని ఆ లేఖలో తెలిపారు.  



Updated Date - 2020-05-30T18:03:30+05:30 IST