కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

ABN , First Publish Date - 2021-09-12T19:51:48+05:30 IST

సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

మెదక్: సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఎగురవేయించాలని, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించి... కేంద్రం ఆర్థిక సహాయంతో నిర్మాణం చేపట్టాలని కోరారు. రజాకార్ల చేతిలో బలైన కుటుంబాలకు ప్రభుత్వం సన్మానం చేయాలన్నారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.


Updated Date - 2021-09-12T19:51:48+05:30 IST