జూనియర్ కాపీ రైటర్ కూడా rahul కంటెంట్పై ఆసక్తి చూపడు : బీజేపీ
ABN , First Publish Date - 2021-07-24T03:02:15+05:30 IST
తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఘాటుగా కౌంటర్
న్యూూఢిల్లీ : తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఫోన్ను విచారణ అధికారులకు సరెండ్ చేయాలని, అప్పుడే నిజా నిజాలేమిటో తెలిసిపోతుందని బీజేపీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ సవాల్ విసిరారు. ఇప్పటికే కాంగ్రెస్ను రెండు సార్లు ప్రజలు తిరస్కరించారని, అయినా పార్లమెంట్ను నిలిపేయాలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కనీసంలో కనీసం ఓ ‘జూనియర్ కాపీ రైటర్’ కూడా రాహుల్ గాంధీ ఫోన్ కంటెంట్ను కాపీ చేడయానికి ఆసక్తి చూపరని రాజ్యవర్ధన్ ఎద్దేవా చేశారు.