ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-08-11T23:22:30+05:30 IST

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు

గుంటూరు: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి నూతన అధ్యక్షులుగా సోము వీర్రాజు వచ్చారు. అనంతరం పార్టీ అధ్యక్షునిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.



రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని బీజేపీ, జనసేన వ్యూహమని, తెలంగాణాతో కలిసి ఉండటం వల్ల 13 జిల్లాలు నష్టపోయాయని సోము వీర్రాజు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది బీజేపీ విధానమని, అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నారు. ఏపీలో మోదీయుజంను స్థాపించటం బీజేపీ లక్ష్యమని, రెండు కుటుంబ పార్టీల మధ్య ఏపీ నష్టపోతుందని, రెండు ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీకి అవకాశం లేదనే వాదన సరికాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Updated Date - 2020-08-11T23:22:30+05:30 IST