‘వైసీపీ విధానాలపై జనసేన, బీజేపీ సంయుక్త పోరాటం’

ABN , First Publish Date - 2020-08-08T02:04:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతానికై ఆ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ముఖ్య నేతలందరినీ ఆయన కలుస్తూ బీజేపీకి మద్దతు

‘వైసీపీ విధానాలపై జనసేన, బీజేపీ సంయుక్త పోరాటం’

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతానికై ఆ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ముఖ్య నేతలందరినీ ఆయన కలుస్తూ బీజేపీకి మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన జనసేన అధినేత పవన్‌ను కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురూ చర్చించారు. అమరావతి, రాష్ట్ర ఆర్థిక స్థితి, కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్రంలో వ్యయం చేస్తున్న తీరు, వర్తమాన రాజకీయ స్థితిగతులు, తదితర అంశాలపై చర్చించారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. కాగా, పవన్‌తో భేటీకి ముందు సోము వీర్రాజు.. చిరంజీవిని కలిశారు.

Updated Date - 2020-08-08T02:04:42+05:30 IST