గొల్లకొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగుర వేస్తాం: సంజయ్

ABN , First Publish Date - 2021-09-18T00:04:36+05:30 IST

రాబోయే ఎన్నికల్లో గొల్లకొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగుర వేస్తామని బీజేపీ రాష్ట్ర

గొల్లకొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగుర వేస్తాం: సంజయ్

నిర్మల్: రాబోయే ఎన్నికల్లో గొల్లకొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగుర వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిర్మల్‌లో బీజేపీ ఆధ్యర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఎవరికీ భయపడేది లేదన్నారు. తెలంగాణ పౌరుషం ఉంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలన్నారు.


తెలంగాణను కేసీఆర్ మూడు ముక్కలు చేశారని, ఒక ముక్కను ఎంఐఎంకు ఇచ్చారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తలేరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇలాంటి వ్యక్తి దేశ ప్రధాని అయితే స్వాతంత్ర్య దినోత్సవం తేదీని కూడా మారుస్తాడన్నారు. "రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, నీ చరిత్రను భూ స్థాపితం చేస్తామ"ని ఆయన పేర్కొన్నారు. సీఆర్ నీచ చరిత్రను కూడా పాఠ్యాంశంలో చేరుస్తామన్నారు. గొల్లకొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగుర వేస్తామన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయిందన్నారు. దీంతో తెలంగాణ తల్లి రోదిస్తోందని సంజయ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-18T00:04:36+05:30 IST