సిద్ధిపేట కలెక్టర్‌పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాం: బండి

ABN , First Publish Date - 2021-10-28T22:57:04+05:30 IST

వరి పంట విషయంలో న్యాయస్థానాల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్ధిపేట

సిద్ధిపేట కలెక్టర్‌పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాం: బండి

హైదరాబద్: వరి పంట విషయంలో కోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్ధిపేట కలెక్టర్‌పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని ఏబీఎన్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. వరి పంటపై కేసీఆర్ డొల్లతనం బయటపడిందన్నారు. ధాన్యం కొనబోమని.. టీఆర్ఎస్ రిలీజ్ చేసిన లేఖలో ఎక్కడా లేదన్నారు. ధాన్యం గురించి తాను మాట్లాడితే ఉప్పుడు బియ్యం గురించిన లేఖను రిలీజ్ చేశారని ఆయన ఆరోపించారు. రా రైస్ ఎంత ఇచ్చినా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సంజయ్ పేర్కొన్నారు. పారాబాయిల్డ్ రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆయన ఆరోపించారు. రైతుకు, ఉప్పుడు బియ్యానికి సంబంధం లేదన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఏబీఎన్‌తో బండి సంజయ్ అన్నారు. 

Updated Date - 2021-10-28T22:57:04+05:30 IST