కేసీఆర్... కల్వకుంట్ల కమీషన్ రావు: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-10-27T02:13:15+05:30 IST

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కేసీఆర్... కల్వకుంట్ల కమీషన్ రావు: బండి సంజయ్

కరీంనగర్: సీఎం కేసీఆర్‌పై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసారు. కల్వకుంట్ల కమీషన్ రావుగా సీఎం కేసీఆర్ మారిపోయారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఓక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. మొట్టమొదటి తెలంగాణ ద్రోహి కేసీఆరేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి నీటి వాటాలో 575 టీఎంసీలు రావాల్సిందని, కానీ 299 టీఎంసీల కోసం కేసీఆర్ సంతకం పెట్టారని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌ల కోసం ఇద్దరు సీఎంలు కుమ్మక్కు అయ్యారన్నారు. వరి పంట విషయంలో సిద్దిపేట కలెక్టర్ బరితెగించి, అహంకారంతో మాట్లాడారని సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కాళ్ళు మొక్కితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చా అని కలెక్టర్‌ను సంజయ్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-27T02:13:15+05:30 IST