నేతాజీ వేడుకల్లో టీఎంసీ, బీజేపీ బాహాబాహీ, ఉద్రికత..

ABN , First Publish Date - 2022-01-23T20:15:59+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో ఆదివారం జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తతలు..

నేతాజీ వేడుకల్లో టీఎంసీ, బీజేపీ బాహాబాహీ, ఉద్రికత..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఆదివారం జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు కోల్‌కతా సమీపంలోని భట్‌పరలో ఘర్షణలకు దిగారు. నేతాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బరాక్‌పోర ఎంపీ అర్జున్ సింగ్‌‌పై కొందరు రాళ్లు రువ్వడంతో కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తినట్టు పోలీసులు తెలిపారు. నార్త్ 24 పరగణాల జిల్లాల్లో ఈ ఘర్షణలతో ఒక పోలీసు వాహనం సహా రెండు కార్లు ధ్వంసమైనట్టు చెప్పారు.


కార్తకర్తల మధ్య ఘర్షణలు తలెత్తడంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌ను అక్కడి నుంచి సురక్షితంగా ఇంటికి చేర్చినట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధ్రువ జ్యోతి డే తెలిపారు. ఘటనా స్థలి వద్ద సీనియర్ అధికారులతో కూడిన పోలీస్ టీమ్‌ను దింపినట్టు చెప్పారు. కాగా, శనివారం రాత్రి పనిహటి ప్రాంతంలోని బీటీ రోడ్డుపై ఉన్న టీఎంసీ కార్యాలయంపై కొందరు నాటుబాంబులు విసిరారని, ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దారితీసిందని పోలీసులు చెప్పారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.

Updated Date - 2022-01-23T20:15:59+05:30 IST