బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-11-26T01:12:14+05:30 IST

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దోబూచులాడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

జనగామ: ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దోబూచులాడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగల్లాత యారయ్యాయని, వాటికి రైతుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. జనగామ జిల్లా కేంద్రంలో బీఎస్పీ జిల్లా కార్యాలయాన్ని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 రోజులుగా కల్లాల్లో ధాన్యాన్ని పోసుకొని రైతులు కొనుగోళ్లకు ఎదురుచూస్తున్నారని, అయినప్పటికీ కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. లాభాల మాట పక్కనపెడితే రైతులకు ధాన్యాన్ని కాపాడుకోవడానికే రూ. 10 నుంచి రూ.15 వేల ఖర్చు వస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం మిల్లర్లతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని, అందువల్లే ధాన్యం కొనుగోళ్లపై కుంటిసాకులు చెబుతుందని ఆరోపించారు. మిల్లర్లు రైతులను దోచుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొన్నాకొనకున్నా తెలంగాణ ప్రభుత్వం కొనితీరాల్సిందేనని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-11-26T01:12:14+05:30 IST